- లయన్స్ క్లబ్ గవర్నర్ చేతులు మీదుగా పంపిణి…
బాధితులకు దుస్తులు,స్టీల్ పాత్రలు పంపిణి…
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహాయం…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట : సూళ్లూరుపేటలోని లయన్స్ క్లబ్ అఫ్ సూళ్లూరుపేట షార్ అద్వర్యంలో వట్రపాలెం వరద బాధితులకు శనివారం మెగా సహాయక కార్యక్రమాన్ని నిర్వహించారు. వట్రపాలెం ప్రక్కనే ఉన్న గ్రీన్ ఫీల్డ్స్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆర్డిఓ చంద్రముని, లయన్స్ క్లబ్ డిస్టీక్ట్ గవర్నర్ వై.నాగేశ్వర్ రావు యాదవ్ తో పాటు మొదటి, రెండవ వైస్ డిస్టీక్ట్ గవర్నర్ లు ఎం.గౌతమ్,ఇ.గోపాల కృష్ణ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహాయ సహకారాలతో లయన్స్ క్లబ్ అఫ్ సూళ్లూరుపేట షార్ వారు ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయములో భాగంగా 600 కుటుంబాలకు సుమారు1000 రూపాయిలు విలువ చేసే దుప్పట్లు,చీరలు,ఇంటికి ఉపయోగపడే స్టీల్ సామాగ్రితో పాటు టవళ్లు, లుంగీలు, బ్యాగులు అతిధులు చేతులు మీదుగా పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభంలో ముందుగా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళి సమర్పించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆదిశేషారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు జెట్టి,ట్రెజరర్ అప్పారావు అద్వర్యంలో సభ్యుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ డిస్టీక్ట్ గవర్నర్ బీవీ. రవికుమార్,డిస్ట్రక్ట్ క్యాబినేట్ సెక్రటరీ రాంరాజ్,రీజినల్ చైర్మన్ డివి.శరత్ బాబు, పి.ఆంజనేయులు, జోనల్ చైర్మన్ మోహన్ రాజ్, మునిసిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్,నెల్లూరు క్లబ్ మరియు నెల్లూరు పినాకిని క్లబ్ ప్రెసిడెంట్ ఇతర క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.