ప్రజాశక్తి – ఏలేశ్వరం
మతోన్మాద, ఫ్యాక్షన్ రాజకీయాలు నిలువరించి ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఎన్నికల బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నైనాలశెట్టి మూర్తి అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంటుకు కేంద్ర కమిటీ సభ్యులు బుగత బంగార్రాజు, ప్రత్తిపాడు అసెంబ్లీ అభ్యర్థిగా జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్రావు, తుని అభ్యర్థిగా వాడిపోయిన శివ పోటీ చేస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిజెపి, ఆర్ఎస్ఎస్ కనుసనల్లో పనిచేసే మిగిలిన పార్టీలు అధికారంలోకి వస్తే మనువాద రాజ్యాంగాన్ని తీసుకొస్తామని బాహాటంగా చెప్తున్నారన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకుడు రేచుకట్ల సింహాచలం, మానుకొండ లచ్చబాబు, గొడుగు సత్యనారాయణ, చిన్నబిల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.