ప్రజాశక్తి – కాకినాడ
ఆంధ్రప్రదేశ్ వర్కిం గ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్) సంఘ నిర్మా ణానికి కృషి చేయాలని సంఘ రాష్ట్ర కార్యదర్శి ఆంజనే యులు పిలుపునిచ్చారు. మంగళ వారం ఎపిడబ్ల్యూజెఎఫ్ కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు వాతాడ నవీన్రాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత సమీక్ష సమావేశాలపై, సభ్యత్వాల నమోదు, మీట్ ది మీడియా, గత 10 సంవత్సరాల ఆడిట్, జర్నలిస్టుల సంక్షేమం పలు అంశా లపై చర్చించారు. ఇటీవల మరణించిన రెడ్డి నాయుడుబాబు మరణానికి చింతిస్తూ మౌనం పాటించారు. జర్నలిస్టుల నుంచి సేకరించిన డబ్బులను రెడ్డి నాయుడు బాబు కుమారుడు పేరున ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని, ఈ పనిని రెండు రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు మాట్లా డుతూ సంఘ నిర్మాణం ప్రతిష్ట చేయడానికి అందరూ కలిసి కృషి చేయాలని, జర్న లిస్టుల సంక్షేమానికి తగిన కార్యచరణను రూపొందిం చుకోవడానికి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగిం దన్నారు. ఫెడరేషన్లో సభ్యత్వం కలిగిన జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న సభ్యులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింప చేయాలని, ఒక ప్రత్యేక సంచికకు ఏర్పాట్లు చేయబో తున్నట్లు తెలిపారు. అనంతరం ఎపిడబ్ల్యూ జెఎఫ్ 2024 డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ముమ్మిడి లక్ష్మణ్, ట్రెజరర్ రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎస్కె.మున్ని, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.