ప్రజాశక్తి-తిరుపతి : తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం పట్టుకుంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచరిస్తోంది. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో చిరుత సంచరించింది. చిరుత సంచారంపై టీటీడీ అప్రమత్తమైది. నడకదారి భక్తులను గుంపులుగా భద్రతా సిబ్బంది అనుమతిస్తోంది. ఇప్పటి వరకు అటవీశాఖ ఐదు చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే.