చీరాల న్యాయవాది తీరంలో మృతి

Feb 3,2024 10:49 #Bapatla District
lawyer died in chirala sea

అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు
రామాపురం సముద్ర తీరంలో మృతదేహం లభ్యం

ప్రజాశక్తి – చీరాల : చీరాల ఆదిత్య అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పట్టణం వాసి న్యాయవాది చెన్నుపాటి నాగేశ్వరరావు (55) మృతదేహం శనివారం ఉదయం రామాపురం సముద్రతీరంలో కనిపించింది. న్యాయవాది మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️