విజయవాడ : ‘ సిపిఎం జన శంఖారావం ‘ విజయవాడ పాయకాపురం ప్రకాష్నగర్ సెంటర్లో గురువారం ఉదయం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా … హర్యానాలో బిజెపి ప్రభుత్వ క్రూరత్వానికి బలైన శుభకరణ్ సింగ్ (21) యువ రైతుకు నివాళులర్పించారు. రెడ్ బెలూన్లకు ఎగరేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ముఖ్య నేతలు ప్రసంగించారు. ‘దేశాన్ని ముంచిన రాష్ట్రాన్ని వంచించిన బిజెపి-వైసిపిలను గద్దె దించండి.. నిరంకుశ బిజెపితో జతకడుతున్న తెలుగుదేశం కూటమిని ఓడించండి.. నీతివంతమైన రాజకీయాలతో దేశ ఐక్యతకు, ప్రజలకు అండగా నిలిచే సిపిఎం, వామపక్షాలను బలపరచండి..’ నినాదంతో వారం రోజులపాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది.