ఆటోను ఢీకొట్టిన లారీ – నలుగురు మృతి

ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి అమలాపురంలోని మామిడికుదురు మండలంలో జరిగింది. నగర గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్‌ పుట్టినరోజు సందర్భంగా … ఎనిమిదిమంది యువకులు యానంలో నిన్న రాత్రి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్వగ్రామానికి ఆటోలో యువకులు బయలుదేరారు. సరిగ్గా రాత్రి 12.30 గంటలకు అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో శ్రీవనువులమ్మ గుడి ఎదురుగా జాతీయ రహదారి 216 రోడ్డు పై ఆటో వెళుతుండగా, అమలాపురం నుండి ముమ్మిడివరం వైపు వెళుతున్న ఎపి39యుఎం 7757 చేపల లారీ, యువకులున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాద స్థలంలోనే మఅతి చెందారు. చనిపోయిన యువకులలో మానేపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఉన్నాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన నలుగురిని వెంటనే కిమ్స్‌ కు తరలించారు. అమలాపురం రూరల్‌ సిఐ వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

➡️