ప్రజాశక్తి-ఆదోని : అంగన్వాడీల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు బి జీవిత, ఆడిట్ సభ్యులు వై రామాంజనేయులు కోరారు. ఆదివారం ఆదోనిలోని శ్రీనివాస సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన 6వ రోజు సమ్మెకు యుటిఎఫ్ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించేంతవరకు ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు కె రుద్రముని, ఆవుల బసప్ప, చాట్ల బాబు, యల్ కె బసప్ప, వై నారాయణ, సి హెచ్ పెద్దయ్య, పి రంగ నాయకులు, నాగేష్, రాముడు, ఉరుకుందయ్య పాల్గొన్నారు.