లక్నో : లూమినస్ పవర్ టెక్నాలజీకి చెందిన సోలార్ ఉత్పత్తుల బ్రాండ్ అమెజ్ ప్రచారకర్తగా విరాట్ కోహ్లీని నియమించుకుంది. తమ సౌర ఆధారిత ఉత్పత్తులతో సహా ఎనర్జీ సొల్యూషన్స్కు విస్తృత ప్రచారం కల్పించనున్నారని ఆ సంస్థ పేర్కొంది. వచ్చే మూడేళ్లలో మూడు రెట్ల వృద్థి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ కంపెనీ సిఇఒ, ఎండి ప్రీతి బజాజ్ తెలిపారు.