కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కిల్లి కృపారాణి

ప్రజాశక్తి – కాశినాయన (వైఎస్ఆర్ జిల్లా) : మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇటీవల వైసిపికి రాజీనామా ఆమెకు షర్మిలారెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ షర్మిలారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి వైఎస్ఆర్ జిల్లా కాశినాయన మండలంలో బస్సు యాత్ర ఆమగంపల్లె గ్రామానికి చేరింది. బస్సు యాత్రలో భాగంగా షర్మిలారెడ్డితో పాటు కిల్లి కృపారాణి కూడా పాల్గొన్నారు. పిల్లి కృపారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి గత ఐదేళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఎన్నో అవమానాలు భరించి ఎన్నో కష్టాలు పడి అవమానపాలయ్యాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ తల్లి పార్టీ అయినా కాంగ్రెస్ లోకి వచ్చి పార్టీ కండువా కప్పుకున్నప్పుడు తల్లి ఒడిలో ఉన్నట్లు ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మన వైయస్ షర్మిల రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆమె మనస్పూర్తిగా కోరారు. షర్మిలా రెడ్డి కచ్చితంగా గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

➡️