ప్రజాశక్తి-విజయవాడ : కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడం తో కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని స్వీత టీడీపీ నుండి బయటకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా ఆయన వైసీపీ గూటికి చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ అధినేత సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోన్నుట్లు తెలస్తోంది. అలానే ఆయనకు వైసీపీ అధిష్టానం విజయవాడ టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న కేశినేని భవన్కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫోటో ఫ్లేక్సీలను కూడా తొలిగించండంతో వార్తలు వాసవమే అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.