వీడియో కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ హాజరు

kejriwal-appears-in-court-through-video-conferencing-in-excise-policy-case

ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఎక్సైజ్ పాలసీ కేసులో కోర్టుకు హాజరు కావాల్సిన కేజ్రీవాల్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున తాను వ్యక్తిగతంగా రాలేనని తెలిపారు. కేజ్రీవాల్ వ్యక్తిగత హాజరు కోసం మరొక తేదీని కోరారు. ఆయన అభ్యర్ధన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీగా కోర్టు నిర్ణయించింది. ఇడీ నమోదు చేసిన ఫిర్యాదుపై కేజ్రీవాల్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఇడీ సమన్లను కేజ్రీవాల్ పాటించడం లేదని ఏజెన్సీ ఆరోపించింది.

➡️