కరాటే బంగారు పతకం విజేతకు సన్మానం

Nov 21,2023 23:23 #Tirupati district

 

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : యూనివర్సిటీ స్థా యి జిల్లా డిగ్రీ కళాశాలల పరిధి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిన జగదీశ్వర్‌ను మంగళవారం పలువురు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థికి యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకం లభించిం ది. 2023-24 విద్యాసంవ త్సరానికి సంబంధించి తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని డిగ్రీ కళాశా లల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించింది. ఇందులో భాగంగా విశ్వ విద్యాలయంలో నిర్వహించిన కరాటే పోటీల్లో 117 కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పుత్తూరులో టిఐ బీఎస్సీ, బిఐఓ ప్రథమ స్థానం సాధించారు. యూనివర్సిటీ ఉన్నతా ధికారు ల నుంచి బంగారు పతకం అందు కున్నాడు. కళాశాల సిబ్బంది జగదీశ్వర్‌ కు అభినందన సభ ఏర్పాటు చేశా రు. ఈ సంద ర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లా డుతూ క్రీడ ల తో మంచి ఆరోగ్యం, పేరు ప్రతిష్టలు వస్తా య న్నారు. ఈ కార్య క్రమంలో కళాశాల వ్యాయా మ అధ్యాపకులు సూర్యబాబు, వైస్‌ ప్రిన్సిపాల్‌ కోటేశ్వరయ్య, పి సుజన, నరసింహారెడ్డి, మురళీమోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️