ప్రజాశక్తి – చీరాల : వైద్యులు తమ వత్తిని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ఐఎంఎకు అండగా ఉంటాననిలని వైసిపి చీరాల నియోజకవర్గ అభ్యర్థి కరణం వెంకటేష్ తెలిపారు. స్థానిక ఐఎంఎ కమ్యూనిటీ హాలులో ఐఎంఎ వైద్యులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఎంఎ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీకాంత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ వారిని మర్యాద పూర్వకంగా కలిసి వారితో మాట్లాడారు. వైద్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం సహకరించాలని కోరారు. అనంతరం ఐఎంఎ వైద్యులు వెంకటేష్ను శాలువా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు డాక్టర్ భవాని, ప్రసాద్ డాక్టర్, డాక్టర్ బాల శంకర్రావు, డాక్టర్ ఉమా మోహన్,డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ గోరంట్ల సుబ్బారావు, డాక్టర్ ప్రదీప్ రతన్, డాక్టర్ బాబూరావు, డాక్టర్ కొండలరావు,డాక్టర్ గోవింద రాజేష్, డాక్టర్ కష్ణ చైతన్య, డాక్టర్ అనిల్ చౌదరి, డాక్టర్ రవికిరణ్,డాక్టర్ హైమా సుబ్బారావు, డాక్టర్ నిరపమ,డాక్టర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.