కపిల మల్లేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం

Mar 7,2024 12:33 #East Godavari

ప్రజాశక్తి-పెరవలి మండల (తూర్పుగోదావరి జిల్లా) : మల్లేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కపిల మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం నందు గురువారం నిర్వహించు స్వామివారి కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు వారి సతీమణి సుమలత వారి కుమారుడు వరుణ్ సాయి పాల్గొన్నారు. వీరి వెంట దేవస్థానం చైర్మన్ సత్య హరినాథ్ సర్పంచ్ బొలిశెట్టి రత్నమాల ఉప సర్పంచ్ బొలిశెట్టి పట్టాభి రామారావు దేవస్థాన కార్య నిర్వహణ అధికారి ఎం. వి.వి .శ్రీనివాసరావు కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.

➡️