ఎన్నికల ప్రచారంలో ‘కందికుంట’ తదితరులు
తనకల్లు : మండల పరిధిలోని గెమేనాయక్ పంచాయతీ అద్దానం పల్లి, నుండి టిడిపి కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికలప్రచారాన్ని బుధవారం చేపట్టారు. రత్నే నాయక్ తండా, బుడ్డయ్య కోట, తులసి నాయక్ తండా, నాయుని చెరువు పల్లి, గేమేనాయక్తండా, పోమే నాయక్ తండా, గద్దలబండ తండా, వేపులపల్లి, నల్లం వాండ్లపల్లి, తవలం గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల గురించి ఈసందర్భంగా ఆయన ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, సర్పంచి మూడేకాంతమ్మ మాజీ కన్వీనర్ శంకర్ నాయుడు, రాజారెడ్డి, టీడీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, సోంపాళ్యం నాగభూషణ, నాగేంద్రప్రసాద్, మిరాశి తోట సరోజమ్మ పాల్గొన్నారు. కదిరి టౌన్ :ప్రజా సంక్షేమం కోసం టిడిపికి ఓటు వేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి ఓటర్లను కోరారు. బుధవారం కదిరి పట్టణం నిజాంవలి కాలనీ 13వ వార్డులో టిడిపి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందించబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. అదే విధంగా కందికుంట యశోదమ్మ పట్టణంలోని 3వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె ఎస్ బహావుద్దీన్, ఎం ఎన్ ఫయాజ్ అలీ ఖాన్, మహబూబ్ బాషా, ఆల్ఫా ముస్తఫా, క్రిష్టప్ప, జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్, దేశం పార్టీ నాయకులు బండారు మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.