హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలతో భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణభవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, గెలిచిన అభ్యర్థులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి, సహ పలువురు మాజీ మంత్రులు, ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా భవిష్యత్ కార్యాచరణపై నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చిస్తున్నారు.