హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్ వేదికగా పలు సెగ్మెంట్ల నేతలతో భేటీ అయిన కేసీఆర్.. ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను దిశానిర్ధేశం చేశారు. అనంతరం నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆయా సెగ్మెంట్ల నేతలతో సుదీర్ఘంగా చర్చించి పేర్లు ప్రకటించారు. ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవిత, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్లను ప్రకటించారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.