పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి : యల్లటూరు

Dec 18,2023 15:05 #Annamayya district
joins in jsp

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పార్టీ గెలుపే లక్ష్యంగా కృషిచేసి జనసేనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు సైనికుడిలా పోరాడాలని మాజీ డి ఆర్ డి ఏ అధికారి, రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం పలువురు జనసేన పార్టీలో చేరారు. మన్నూరులో గల యల్లటూరు భవన్ లో శ్రీనివాసరాజు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు తమను ఆకర్శించాయని ఈ సందర్బంగా పార్టీలో చేరినవారు తెలియజేశారు. శ్రీనివాసరాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాలలోని ప్రజలు జనసేన పార్టీకి మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, కష్టపడ్డ ప్రతిఒక్కరికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని తెలిపారు.  టీడీపీ, జనసేన కూటమి అధికారం లోకి రాగానే స్థానిక సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, ప్రజలకు మీ ద్వారా భరోసా కల్పించాలని వారికి సూచించారు. పార్టీలో చేరిన వారిలో కాపు వైసీపీ నాయకులు మరియు రాజంపేట కాపు సంక్షేమ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల చలపతి, బలిజ నాయకులు భీమినేని రమేష్, గాజుల చిన్న కులాయప్ప, కుప్పాల మల్లికార్జున, షేక్ దర్బార్, షేక్ జావీద్ భాషా నూర్ భాషా, మౌలా, పఠాన్, చీమకుర్తి శివుడు రుద్రరాజు లక్ష్మీకర్, ముమ్మడి రాజు, శివశంకర్ రాజు, సాయి రాజు తదితరులు ఉన్నారు.

➡️