ప్రజాశక్తి-కంభం(ప్రకాశం) : కందులాపురం సెంటర్ వద్ద అంగన్వాడీ దీక్ష శిబిరంలో 27వ రోజు సమ్మెను కొనసాగిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీవో నెంబర్ 2 రద్దు చేయాలంటూ ఎస్మాను ఎత్తివేయాలంటూ.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నినాదాలు చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఎస్మాను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 2 కాపీలను దగ్ధం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై ఎటువంటి జీవోలు తీసుకొచ్చిన తగ్గేది లేదు అంటూ.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ షేక్ అన్వర్ భాష, సిపిఎం నాయకులు దానం, సిఐటియు నాయకులు వెంకట్ మూడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు శ్రీదేవి, ఆదిలక్ష్మి ,స్వర్ణలత, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు.