జనసేన, టీడీపీ కూటమికి అండగా నిలవాలి – జనసేన వినుత

Nov 21,2023 22:44 #Tirupati district

 

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: జనసేన, టీడీపీ కూటమికి ప్రజలు అండగా నిలవాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ ఛార్జి వినుత కోటా విజ్ఞప్తి చేశారు. ‘జనసేన విజయ యాత్ర- ఏపీ నీడ్స్‌ పవన్‌ కల్యాణ్‌’లో భాగంగా మంగళవారం ఆమె శ్రీకాళహ స్తి మండలం నారాయణపురం పంచాయతీ విశాలాక్షినగర్‌ లో పర్యటించారు. స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వినుత కోటా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో పడుతున్న బాధలు గురించి స్థానికులు ఆమెకు వివరించారు. వినుత కోటా జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెప్టో గురించి ప్రజలకు తెలిపారు. ఈ కూటమిని గెలిపిస్తే భవిష్యత్తు గ్యారంటీ అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్‌, ఐటీ కో-ఆర్డినేటర్‌ కావలి శివకుమార్‌, నాయకులు పేట చిరంజీవి, శారద, కవిత, బత్తెమ్మ పుష్ప, రాజేష్‌, సురేష్‌, గురవయ్య, హేమంత్‌ , దినేష్‌, జనసైనికులు తులసీ రామ్‌, దివాకర్‌, కొండ మిట్ట గోపి పాల్గొన్నారు.

➡️