శ్రీలంక : శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, మలేషియా ఎంపీ ఎం శరవణన్ ఈ సంబురాలను ప్రారంభించారు. ట్రింకోమాలీలో క్రీడా మైదానంలో జరుగుతున్న జల్లికట్టు సంబరాల్లో మొత్తం 200 ఎద్దులు పాల్గొననున్నాయని నిర్వాహకులు తెలిపారు. సంబరాలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ప్రముఖుల కోసం అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్పష్టంగా వీక్షించేందుకు మైదానం అంతటా భారీ స్క్రీన్లు బిగించారు.