” జగన్మోహనా! నీకో దండం..”

చీపురుపల్లి (విజయనగరం) : ” జగన్మోహనా! నీకో నమస్కారం, మా సమస్యలు పరిష్కరించి పుణ్యం కట్టుకో ” అంటూ … అంగన్వాడీలు మోకాళ్ళపై నిలబడి దండాలు పెట్టి వినూత్న నిరసన తెలిపారు. చీపురుపల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ” నువ్విచ్చిన జీతాలు చాలక పిల్లా పాపలతో ఇబ్బందులు పడుతున్నాం, 29 రోజుల నుండి సమ్మె చేస్తున్నా మా పట్ల కనీసం నీకు కనికరం కూడా లేకుండా ఎస్మా ప్రయోగించి ఇబ్బందులకు గురి చేస్తున్నావు. మా ఉసురు నీకు తగలక మానదు. ఇప్పటికైనా స్పందించి మా న్యాయమైన సమస్యలను పరిష్కరించు ” అంటూ దండాలు పెట్టారు.

➡️