ప్రజాశక్తి – ఆలమూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదిస్తూ ఆంధ్ర ప్రజల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని చొప్పెల్ల పంచాయితీ, పిహెచ్సిల వద్ద ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జెడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు, సర్పంచ్ దంగేటి చంద్రకళ బాపనయ్యల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి, పిహెచ్సి వద్ద రోగులకు పండ్లు, పాలుతో పాటుగా బాలలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారిని సువర్చల నాయుడు, వైద్యులు మల్లికార్జునరావు, కార్యదర్శి శ్యామ్ సుందర్, వైసిపి గ్రామ అధ్యక్షుడు వాసన రాజు, వైసీపీ సీనియర్ నేత జాంపోలు మాణిక్యం, ఉప సర్పంచ్ తోరాటి దుర్గారావు, సచివాలయ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.