ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడోదశ పోలింగ్ నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం జారీ చేసింది. మొత్తం 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 94 లోక్సభ నియోజకవర్గాలకు మే 7న పోలింగ్ నిర్వహించనుంది. ఈ నెల 12 నుంచి 19 వరకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోడానికి గడువు నిచ్చింది. అసోం-4, బీహార్-5, చత్తీస్గడ్-7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తర ప్రదేశ్-10, పశ్చిమబెంగాల్-4, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ-2, జమ్మూకాశ్మీర్-1 స్థానాలకు మూడవ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.