మేమే దాడి చేశాం

Jan 5,2024 11:12 #Islamic State, #Tehran
  •  ఇరాన్‌లో జంట పేలుళ్లుపై ఐసిస్‌

టెహ్రాన్‌ :   బుధవారం ఇరాన్‌లో వందమందికిపైగా పౌరులను బలి తీసుకున్న జంట పేలుళ్లు తమ పనేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డు మాజీ జనరల్‌ ఖాసిమ్‌ సులేమని వర్థంతి సందర్భంగా తమ సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు ఈ పేలుళ్లు జరిపారని ఐసిస్‌ టెలిగ్రామ్‌లో విడుదలజేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తమ అణు శాస్త్రవేత్తలను, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని వరుసగా జరుగుతున్న దాడుల వెనక ఇజ్రాయిల్‌, అమెరికా హస్తం ఉందని ఇరాన్‌ ప్రభుత్వం ఆరోపించింది.

➡️