అంతర్జాతీయ మహిళ దినోత్సవం

Mar 7,2024 22:58

ప్రజాశక్తి – కొల్లూరు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీడీఒ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సభ నిర్వహించారు. ఎంపీడీఒ బిఎం లక్ష్మీ కుమారి మాట్లాడుతూ సనాతన సాంప్రదాయాలను పక్కనపెట్టి ప్రతి మహిళ వంటింటికే పరిమితం కాకుండా అన్నిట్లోనూ ముందుండాలని కోరారు. సమానత్వ సాధన కోసం ఉద్యమించడమే నేడు మహిళల ముందున్న కర్తవ్యమని అన్నారు. ఎంపీపీ కమ్మిల నాంచారమ్మ, అమృతలూరు ప్రాజెక్ట్ సిడిపిఓ విజయలక్ష్మి, వేమూరు ఎఎంసి చైర్మన్ ఉప్పు శిరీషను సన్మానించారు.

➡️