ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ -2 పరీక్ష మంగళవారం జరిగింది. నర్సాపురం ఆదిత్య , శ్రీ సూర్య, బి జి బి ఎస్ ఉమెన్స్ , గౌతమి, శ్రీ వైన్ డైమండ్ జూబ్లీ ,భాస్కర కళాశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతిస్తున్నారు. కళాశాల వద్ద వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. బి జి బి ఎస్ మహిళా కళాశాలలో ఇంగ్లీష్ టు పేపర్ కి 219 హాజరుకావాల్సి ఉండగా 210 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు.