సెంచూరియన్ : రెండు రోజులుగా సెంచూరియన్లో వర్షంపడటంతో మైదానం కాస్త చిత్తడిగా ఉంది. దీంతో భారత్- దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేసి.. 1.30 గంటలకు మ్యాచ్ను ప్రారంభించాల్సి ఉంది. కానీ, ఔట్ఫీల్డ్ సిద్ధంగా లేకపోవడంతో 1.30 గంటలకు పిచ్ పరిశీలించి అంపైర్లు నిర్ణయం తీసుకుంటారు.