కోల్కతా : బిజెపిప్రభుత్వేతర రాష్ట్రాల్లో కేంద్రం దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్లో టిఎంసి నేత స్వరూప్ బిస్వాస్ నివాసంపై ఐటి అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. నగరంలోని స్వరూప్కు సంబంధించిన ఆరు ప్రాంతాల్లో ఐటి అధికారులు సోదాలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను ఎగవేత, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
స్వరూప్ బిస్వాస్ పశ్చిమబెంగాల్ విద్యుత్ శాఖ మంత్రి అరుప్ బిస్వాస్ సోదరుడు.