కపిలేశ్వరపురంలో ఇసుక దోపిడీ

Nov 24,2023 12:27 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : కపిలేశ్వరపురం మండలంలో ఇసుక దోపిడీ జరుగుతుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల నుంచి ఈ దోపిడీ జరుగుతుందని ఇప్పటివరకు 7 వందల లారీల ఇసుక తరలించారన్నారు. రామచంద్రపురంలో దోపిడీని తట్టుకోలేక ఆయనను ఇక్కడికి గింటవేస్తే ఇక్కడ వచ్చి కేశవరంలో గ్రావెల్, ఇసుక దోపిడీ చేస్తూ సెటిల్మెంట్ల ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, తాసిల్దారులను అడిగిన సమాధానం చెప్పడం లేదన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని నాయకులతో మాట్లాడుకుని దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే మొత్తం ఆర్.ఆర్ యాక్ట్ దోసినదానిని రికవరీ చేయడంతో పాటు అధికారులను జైలుకు పంపడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం తెలుసుకుని దోపిడీని అడ్డుకోవాలన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️