వేంపల్లె : హాస్టల్ భవనంపై నుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి ఇడుపులపాయలో జరిగింది.
ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల గ్రామానికి చెందిన కుర్రిరేఖ ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇంజినీరింగ్ కోర్సు పూర్తయ్యింది. మరో పదిరోజుల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న రాత్రి 7 గంటల 30 నిముషాలకు ఆమె హాస్టల్ భవనంపై నుంచి దూకింది. ఈ ఘటనలో ఆమెకు కాలు విరగడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు, ట్రిపుల్ఐటీ సిబ్బంది వెంటనే ట్రిపుల్ఐటీలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి 10 గంటల 30 నిముషాలకు విద్యార్థిని మఅతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్ఐటీ డైరెక్టర్ కుమారస్వామిగుప్త, హాస్టల్ సంక్షేమాధికారి ఇమ్రాన్షరీఫ్ విద్యార్థిని మఅతదేహాన్ని పరిశీలించారు. సదరు విద్యార్థిని ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.