క్యాన్సర్‌ బారినపడిన ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్‌ సోమనాథ్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గతేడాది సెప్టెంబరు 2న సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్‌1 మిషన్‌ ను ప్రయోగించిన రోజున తాను క్యాన్సర తో బాధపడుతున్న విషయం నిర్ధారణ అయిందని వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, క్యాన్సర్‌ నుంచి కోలుకున్నానని తెలిపారు. కడుపులో కణితి పెరిగిందని, ఈ తరహా క్యాన్సర్‌ వంశపారంపర్యంగా వచ్చిందని ఆయన వివరించారు. నాకు క్యాన్సర్‌ అని తెలియగానే మా కుటుంబం, నా ఉద్యోగ సహచరులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నా. కీమోథెరపీ చికిత్స కూడా తీసుకున్నాను. నేను ఆసుపత్రిలో ఉన్నది కేవలం నాలుగు రోజులే. మొదట్లో భయపడ్డాను కానీ, క్యాన్సర్‌ కు చికిత్స ఉందన్న విషయం ఇప్పుడు నాకు అర్థమైంది” అని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ వివరించారు.

➡️