ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : వైద్యులందరూ వైద్య వృత్తిని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ఐఎంఎఫ్ కు తాను అండగా ఉంటానని రానున్న ఎన్నికలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు అందరూ సహకరించి తన గెలుపుకు కఅషి చేయాలని వైసిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ అన్నారు. శనివారం స్థానిక ఐఎంఏ కమ్యూనిటీ హాల్లో ఐఎంఏ వైద్యులను ఆయన మర్యాదపూర్వకంగా కలసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీదేవి డాక్టర్ శ్రీకాంత్ లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … వైద్యుల సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఎదురైన తాను అండగా ఉంటానని అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపుకు నియోజకవర్గంలో తన గెలుపుకు పూర్తి మద్దతును తెలియజేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఐఎంఏ వైద్యులు వెంకటేష్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు డాక్టర్ భవాని ప్రసాద్, డాక్టర్ బాల శంకర్రావు, డాక్టర్ ఉమా మోహన్, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ గోరంట్ల సుబ్బారావు, డాక్టర్ ప్రదీప్ రతన్, డాక్టర్ బాబురావు, డాక్టర్ కొండలరావు, డాక్టర్ గోవింద రాజేష్, డాక్టర్ కఅష్ణ చైతన్య, డాక్టర్ అనిల్ చౌదరి, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ నిరపమ, డాక్టర్ రవీంద్రబాబు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.