ఐసీసీ 2023 వన్టే జట్టును ప్రకటన… కెప్టెన్‌గా రోహిత్‌

Jan 23,2024 16:43 #Cricket, #rohit sharma, #Sports

2023 సంవత్సరానికి గాను ఐసీసీ వన్డే జట్టును మంగళవారం ప్రకటించింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో రాణించిన రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అంతేగాక ఈ జాబితాలో భారత్‌ నుంచి మొత్తం ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. అలాగే ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఉండగా.. న్యూజిలాండ్‌కు చెందిన మరొక ప్లేయర్‌ ఉన్నారు.

ఐసీసీ ప్రకటించిన జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, ట్రావిస్‌ హెడ్‌, విరాట్‌ కోహ్లీ, డారిల్‌ మిచెల్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ (వికెట్‌ కీపర్‌), మార్కో జాన్సన్‌, ఆడమ్‌ జంపా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ.

➡️