మానవతా సంస్థ ఆర్థిక సహాయం

Apr 25,2024 01:07 ##podili

ప్రజాశక్తి – పొదిలి
నగర పంచాయితీ పరిధిలోని దాసరిగడ్డలో బుధవారం మృతి చెందిన పసుపులేటి వెంకటేశ్వర్లు కుటుంబానికి మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. వెంకటేశ్వర్లు మృత దేహానికి ఘన నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ కె యల్లమందారెడ్డి, డైరెక్టర్ శ్రావణి వెంకటేశ్వర్లు, జి శ్రీను, అధ్యక్షులు కల్లం సుబ్బారెడ్డి, కార్యదర్శి తానికొండ వెంకట్రావు, ఉపాధ్యక్షుడు బండి అశోక్, స్థానికులు గురునాధం, మహేష్, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️