రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి చాక్లెట్స్‌ గుట్టు రట్టు..

Jan 30,2024 10:53 #ganjay, #hydrabad

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి చాక్లెట్స్‌ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్స్‌ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఇక, కోకాపేట్‌ రాంకీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ దగ్గర అధికారులు సోదాలు చేశారు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్‌ కు చెందిన గంజాయి చాక్లెట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఒడిస్సాకు చెందిన సౌమ్యా రాజన్‌ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఒడిస్సా నుంచి గంజాయి చాక్లెట్స్‌ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు NDPS యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️