సృజన సాహితీ ఆధ్వర్యంలో సన్మానం

Jan 1,2024 00:47

ప్రజాశక్తి అద్దంకి
సృజన సాహిత్య సమావేశం చిన్ని శాంతయ్య, పిచ్చమ్మ సేవా సదనంలో గాదేపల్లి దివాకర దత్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. కె అనిల కుమారసూరి అతిధులను ఆహ్వానించారు. సభలో ఆర్‌వి రాఘవరావు, ఇలపావులూరి శేషతల్పశాయి, పాలపర్తి జ్యోతిష్మతి స్వీయకథా పఠనం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. డాక్టర్‌ బీరం సుందరరావు లబ్ధ ప్రతిష్టులని, వారి కవితలు సమాజహితాన్ని కోరే రచనలని దివాకరదత్ అన్నారు. నవ్యకవుల అభివ్యక్తి అద్భుతంగా ఉంటుందని అన్నారు. పదబంధాలు, ఆలోచనా విధానం కొత్తదనానని తెచ్చిందని డాక్టర్‌ బీరం సుందరరావు పేర్కొన్నారు. రిటైర్డ్ డిఎస్‌పి బీరం నాగేశ్వరరావు సభలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన రావూరి రంగయ్య తెలుగు భాషాభివృద్ధి కోసం నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. డాక్టర్‌ యు దేవపాలన, రుద్రయ్య, రోటరీ బాధ్యులు మలాది శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, లేవిప్రసాద్, నర్రా శ్రీలక్ష్మి అభినందించారు. సృజన సన్మాన పత్రం, దుశ్శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. నిమ్మరాజు నాగేశ్వరరావు, పసుమర్తి కోటయ్య, లక్కరాజు శ్రీనివాసరావు, డివిఎం సత్యనారాయణ, షేక్ మస్తాన్, పూర్ణచంద్రరావు, పాటిబండ్ల శ్రిమన్నారాయణ, అనంతు నాగేశ్వరరావు, షేక్ మహమ్మద్ రఫి పాల్గొన్నారు.

➡️