అమరావతి: కడప జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోమ్ గార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్ మీనాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేటు సెక్యూరిటీగా ఉన్నవారిని, వారి దగ్గర పనిచేసిన వారందరినీ కడప జిల్లాలో హోమ్గార్డులుగా నియమించారని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వీరంతా అధికారులను తప్పుదారి పట్టించే అవకాశం, కీలక సమాచారాన్ని వైసిపి నాయకులకు చేరవేసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని, లేని పక్షంలో ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు.