విద్యతోనే ఉన్నత అభివృద్ధి

Feb 1,2024 00:46

ప్రజాశక్తి – చీరాల
విద్యతోనే మంచి భవిష్యత్తు లభిస్తుందని పలువురు న్యాయవాదులు అన్నారు. అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని ఈపురుపాలెం లైట్ హౌస్ చిల్డ్రన్స్ హోంలో న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం నిర్వహించారు. పోక్సో యాక్ట్, బాల కార్మిక నిరోధక చట్టంతో పాటు వివిధ చట్టాలను వివరించారు. చదువు ఆవశ్యకత తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఎ సతీష్‌రెడ్డి, టీ సురేష్, పిఎల్‌విఎస్‌డి మతీన్, లైట్ హౌస్ చిల్డ్రన్స్ హోం నిర్వాహకులు ఎ జాన్ రాబర్ట్ స్టీవెన్ సన్ పాల్గొన్నారు.

➡️