కడప : కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులపై తీవ్ర కలకలం రేగింది. బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో… మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మైదుకూరు మండలం చెల్రోపల్లె వద్ద పిఎఫ్ఐ సభ్యుడు సలీం ఓ నివాసంలో తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో కడప జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. చెర్లోపల్లి జేసీబీ ఓనర్ కు ఆగంతకుడు ఫోన్ చేసి రెండు రోజులు తన వద్ద ఉంచుకోవాలని అన్నాడు. చెర్లోపల్లి మస్జీద్ లో సలీమ్ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సలీం పై రెండులక్షల రూపాయల రివార్డ్ ఉంది. సలీంను మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో… కడపలో హై అలర్ట్ కొనసాగుతోంది.