నారాయణపేట పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ సమీపంలోని బసవేశ్వర జిన్నింగ్, కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగిందిస. ఆదివారం తెల్లవారుజామున జరిగిన షార్ట్ ర్క్యూట్‌తో మిల్లు కాలిబూడిదైంది. మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పత్తి బండల్స్, విత్తనాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.8 కోట్ల నష్టం వాటిల్లినట్లు మిల్లు యాజమాన్యం తెలిపింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు.

➡️