చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Nov 23,2023 14:44 #Nara Chandrababu

అమరావతి: ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం విచారణను శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. సీఐడీ తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు మద్యం కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది.

➡️