ముంబయి: ఐసిసి వన్డే ప్రపంచకప్ సందర్భంగా గాయపడ్డ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగు నెలల విరామం తర్వాత రీ ఎంట్రీ చేశాడు. ముంబయిలో జరుగుతున్న డీవై పాటిల్ టి20 కప్-2024లో హార్దిక్ రిలయన్స్-1 జట్టు తరఫున బరిలోకి దిగాడు. 16జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో హర్దిక్ రిలయన్స్ టీమ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. బిపిసిఎల్తో సోమవారం జరిగిన మ్యాచ్లో హార్దిక్ రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లోనూ మెరిసాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బిపిసిఎల్ 15 ఓవర్లలో 126 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్య ఛేదనకు తడబడిన హార్దక్ సేన 8వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఐపిఎల్లో ముంబయి యాజమాన్యం రోహిత్ను తప్పించి.. హార్దిక్కు కెప్టెన్సీ అప్పగించిన విషయం తెలిసిందే.