అత్తింటి వేధింపులు.. ముగ్గురి ప్రాణాలు బలి

Apr 3,2024 08:09 #dead, #harassment, #three members

కరీంనగర్‌ : అత్తింటి వేధింపులు తట్టుకోలేక బిడ్డతోపాటు తల్లి ఆత్మహత్య చేసుకోగా…. కుమార్తె, మనవడి మరణాన్ని చూసి మనస్తాపం చెందిన తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన మంగళవారం కరీంనగర్‌ సమీపంలోని బమ్మకల్‌లో జరిగింది.

కరీంనగర్‌ రూరల్‌ సిఐ ప్రదీప్‌కుమార్‌ కథనం, పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు … బమ్మకల్‌లోని విజయనగరి కాలనీలో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరాచారి, జయప్రద (51)లకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్ద కుమార్తె దివ్యాంగురాలు. రెండో కుమార్తె శ్రీజ (27)కు మూడేళ్ల కిందట వరంగల్‌కు చెందిన ముగ్ధుంపూర్‌ నరేశ్‌కు ఇచ్చి పెండ్లి చేశారు. ఆ సమయంలో రూ.3 లక్షల నగదు, ఇతర సామగ్రిని కట్నంగా ఇచ్చారు. నరేశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో కుటుంబం హైదరాబాద్‌లో నివాసముంటోంది. నరేశ్‌, శ్రీజలకు 11 నెలల కుమారుడు రేయాన్ష్‌ అలియాస్‌ అర్విన్‌ ఉన్నాడు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతోపాటు అదనపు కట్నం కావాలని అత్త సుజాత, మామ కేశవాచారి శ్రీజను వేధించేవారు. ముగ్గురూ కలిసి మానసికంగా వేధించడంతోపాటు కొట్టేవారు. అయిదు రోజుల క్రితం బాబుతో పాటు శ్రీజను పుట్టింటికి పంపారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మంగళవారం ఉదయం అత్తమామలు, భర్త ఫోన్‌ చేసి.. మరో నెల రోజుల్లో కుమారుడి పుట్టినరోజు వేడుకల గురించి మాట్లాడారు. ‘పుట్టినరోజు వేడుకలు నువ్వే చేసుకో.. మేము రాము’ అంటూ దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీజ ఆన్‌లైన్‌లో కొన్ని మాత్రలు తెప్పించి తన కుమారుడికి మాత్రలు మింగించి, తానూ వేసుకుంది. వారిని ఆమె తల్లిదండ్రులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. శ్రీజకు చికిత్స మొదలుపెట్టారు. కానీ కాసేపటికే ఆమె కూడా మఅతి చెందింది. చికిత్స జరుగుతున్న సమయంలో ఇంటికి వెళ్లిన జయప్రద కుమార్తె వేసుకున్న మాత్రల్లో మిగిలినవాటిని మింగింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను పక్కింటివారు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మఅతి చెందింది. భార్య, కుమార్తె, మనవడి అతితో వెంకటేశ్వరాచారి గుండెలు బాదుకొని రోదించిన తీరు అక్కడున్నవారిని గుండెలను కలిచివేసింది. వెంకటేశ్వరాచారి ఫిర్యాదు మేరకు శ్రీజ భర్త నరేశ్‌, అత్తమామలు సుజాత, కేశవచారిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ప్రదీప్‌ తెలిపారు. ఆత్మహత్యకు ఉపయోగించిన మాత్రలను శ్రీజ యూట్యూబ్‌లో వెతికి.. ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

➡️