ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

Apr 5,2024 23:20
ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

ప్రజాశక్తి- యంత్రాంగం మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ 116వ జయంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆయనకు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్‌ మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో డిఆర్‌ఒ జి.నర్సింహులు, విద్యార్థినులతో కలిసి జగ్జీవన్‌రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి.సందీప్‌ పాల్గొన్నారు. నిడదవోలు సింగవరంలో ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస్‌ నాయుడు, చెట్టే రాజు, మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదిబాబు సింగవరం సొసైటీ అధ్యక్షులు పెన్మెత్స చందు, ముదునూరి జగదీష్‌ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాళ్లపూడి తహశీల్దారు సిహెచ్‌.శ్రీనివాసరావు రెవెన్యూ కార్యాలయం వద్ద ఘనంగా నివాళులర్పించారు. గణాంక అధికారి జోడాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రాజానగరం నన్నయ యూనివర్సిటీలో జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి విసి ఆచార్య కె.పద్మరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య పి.సురేష్‌ వర్మ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర ఎం.గోపాలకృష్ణ పాల్గొన్నారు. పెరవలి జగజ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి వైసిపి నాయకులు గంగోలు మణి బాబు, నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

➡️