ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి ధర్నా చౌక్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ హమాలీ సంఘాలు, ఎపి.వేర్ హౌస్ హమాలీలు ర్యాలీ నిర్వహించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ యూనియన్ల గౌరవ అధ్యక్షుడు టి.రాముడు, అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు. సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు ఆర్.నరసింహులు, సీయచ్.సాయిబాబాలు మాట్లాడుతూ..కనీస వేతనాలు అమలు చేయాలని ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఎన్నికలకు ముందు సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా చౌక్ నుండి.. కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు తలపెట్టిన జైలుబరో కార్యక్రమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. ఈ కార్యక్రమంలో భీసన్న, మల్లికార్జన, బి.రామకృష్ణ, నాగరాజు, వెంకటేశ్వర్లు, త్యాగరాజు, మద్దిలేటి, షేక్ షా, వలి, నాగన్న, చాంద్ బాషా, మల్లి, నారాయణమ్మ, కృష్ణ, నాగన్న, తదితరులు పాల్గొన్నారు.