గ్రూప్‌-2 దరఖాస్తు గడువు పొడిగింపు

Jan 11,2024 07:18 #Group Exams, #postpone

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రూప్‌-2 పోస్టుల దరఖాస్తు గడువును ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) పొడిగించింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి జె ప్రదీప్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10వ తేదితో ముగిసిన గడువును ఈ నెల 17వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 25వ తేదిన స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు.

➡️