పంట నమోదు జాబితాపై గ్రామసభ

Mar 2,2024 23:15

ప్రజాశక్తి – నగరం
మండలంలోని అన్ని గ్రామాల రైతు భరోసా కేంద్రాల్లో సోషల్ ఆడిట్ కొరకు పంట నమోదు జాబితాలను రైతులు తనిఖీ కొరకు ప్రదర్శించినట్లు ఎఒ వేమూరి రమేష్‌బాబు తెలిపారు. పంట నమోదు చేసుకున్న రైతుల వివరాలు సరి చూసుకోవాలని కోరారు. ఏవైనా తప్పులు ఉంటే ఈ నెల 5లోపు రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకునికి తెలిపి సరిచేసుకోవాలని తెలిపారు. బోరమాదిగపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద పంట నమోదు వివరాలపై శనివారం గ్రామ సభని నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ చందోలు దేవదాసు, ఉప సర్పంచ్ నల్లూరి రత్నబాబు, వ్యవసాయ సహాయ సంచాలకులు సయ్యద్ అక్తర్ హుస్సేన్, ఎఇఒ ఎం లీల, వీరవరప్రసాద్ పాల్గొన్నారు.

➡️