ఇస్రోకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అభినందన

Jan 1,2024 14:31 #ap governer

ప్రజాశక్తి-విజయవాడ: పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కొత్త సంవత్సరం రోజున మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్‌ఎల్‌వీ-సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరింది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అమెరికా తర్వాత బ్లాక్‌ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ దేశంగా భారతదేశం అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు.

➡️